కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్‌రాజ్, సీతమడి 5రో. యాత్ర – అప్ డౌన్ బై ఫ్లైట్ యాత్ర తేధి 7-10-2026 రూ.31,000. రిటర్న్ 11-10-26

5 రోజుల కాశీ, , ప్రయాగ్‌రాజ్, నైమిశరణ్యం,సీతమడి, అయోధ్య అప్ డౌన్ ఫ్లైట్ యాత్రా ప్యాకేజీ. రూ. 31,000/-. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్‌రాజ్, సీతమడి 5రో. యాత్ర – అప్ డౌన్ బై ఫ్లైట్ యాత్ర తేధి 7-10-2026 రూ.31,000. రిటర్న్ 11-10-26

 సంప్రదించండి: శ్రీ టూర్స్ మొబైల్ నెంబర్: 8985246542

ప్రయాణ వివరాలు: ఈ పవిత్ర యాత్ర 7-10-2026 ఉదయం హైదరాబాద్ నుండి ఫ్లైట్ ద్వారా ప్రారంభమవుతుంది. అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం ముగిసిన అనంతరం, తిరిగి 11-10-2026 న అయోధ్య నుండి ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ చేరుకోవడంతో ఈ యాత్ర పూర్తవుతుంది.

ఈ యాత్రలో మనం సందర్శించే ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు మరియు వాటి విశేషాలు:

ప్రయాగ్‌రాజ్ (త్రివేణి సంగమం) భూలోకంలో అత్యంత పవిత్రమైన పుణ్యతీర్థాలలో ప్రయాగ్‌రాజ్ ఒకటి. ఇక్కడ గంగా, యమునా మరియు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదుల కలయిక జరుగుతుంది. ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్ర సందర్శనతో మన యాత్ర ఆధ్యాత్మికంగా మొదలవుతుంది.

మాధవేశ్వరి శక్తిపీఠం (అలోపీ దేవి ఆలయం) త్రివేణి సంగమానికి సమీపంలోనే ఉన్న అలోపీ బాగ్ ప్రాంతంలో కొలువైన మహా శక్తిపీఠం ఇది. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు కీర్తించిన అష్టాదశ (18) శక్తిపీఠాలలో ప్రయాగ్‌రాజ్‌లోని ఈ మాధవేశ్వరి శక్తిపీఠం కూడా ఒకటి.

  • పురాణ నేపథ్యం: దక్షయజ్ఞ సమయంలో అగ్నిగుండంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి భౌతిక కాయాన్ని పరమశివుడు మోసుకెళ్తున్నప్పుడు, శ్రీ మహావిష్ణువు ప్రయోగించిన సుదర్శన చక్రం వల్ల ఆమె శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అందులో సతీదేవి కుడిచేతి వేళ్లు పడిన ప్రదేశమే ఈ ప్రయాగ్‌రాజ్ అని పురాణాలు చెబుతున్నాయి.
  • ఆలయ విశిష్టత (విగ్రహం లేని గుడి): ఈ శక్తిపీఠం యొక్క అతి పెద్ద విశేషం ఏమిటంటే.. గర్భగుడిలో అమ్మవారికి ఎటువంటి విగ్రహం (మూర్తి) ఉండదు. గర్భగుడి మధ్యలో ఒక చెక్క ఉయ్యాల (ఝూలా) లేదా చెక్క పీఠం ఉంటుంది. ఆ ఉయ్యాలనే సాక్షాత్తు మాతా మాధవేశ్వరి (అలోపీ దేవి) గా భక్తులు పూజిస్తారు.

 

  • మహాలయ అమావాస్య విశిష్టత: ప్రయాగ రాజ్ త్రివేణి సంగమంలో  పితృ పిండప్రదాన మహా పుణ్యం
  • భాద్రపద మాసంలో వచ్చే పితృ పక్షాల (మహాలయ పక్షాలు) ముగింపు రోజే ‘మహాలయ అమావాస్య’. హిందూ ధర్మంలో పితృదేవతలను (స్వర్గస్తులైన పెద్దలను) స్మరించుకుంటూ, వారికి తర్పణాలు వదలడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలు భూలోకానికి వచ్చి తమ వంశీకులు అందించే నైవేద్యాల కోసం ఎదురుచూస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.  వారికి శ్రద్ధగా పిండప్రదానం చేయడం వల్ల వారు పూర్తి తృప్తి చెంది, తమ వంశం వృద్ధి చెందాలని దీవిస్తారు.
  •  

కాశీ – వారణాసి (దివ్య క్షేత్ర దర్శనం) పరమశివుని రాజధాని అయిన కాశీ మహాక్షేత్రంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాల దర్శనం ఉంటుంది:

  • శ్రీ కాశీ విశ్వనాథ మందిరం (మోక్ష ప్రదాత) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రధానమైన శ్రీ కాశీ విశ్వనాథం సాక్షాత్తు పరమశివుడి నిలయం. గంగా తీరాన ఉన్న ఈ బోళా శంకరుడిని కన్నులారా దర్శించుకుని, ఆ లింగాన్ని తాకితే జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తి (మోక్షం) లభిస్తుందని ప్రతీతి. గుడి ప్రాంగణంలో నిరంతరం మార్మోగే ‘హర హర మహాదేవ’ నామస్మరణలు భక్తులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి.
  • శ్రీ అన్నపూర్ణా దేవి ఆలయం (జగన్మాత సన్నిధి) కాశీలో అడుగుపెట్టిన జీవులందరికీ కడుపు నింపే కరుణామూర్తి శ్రీ అన్నపూర్ణా దేవి. సాక్షాత్తు పరమశివుడికే భిక్ష వేసిన ఈ మహా తల్లి గురించి “కాశీలో ఎవరూ ఆకలితో పడుకోరు” అని చెబుతారు. అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ మహా ప్రసాదం స్వీకరిస్తే జీవితంలో అన్నపానాలకు, సిరిసంపదలకు ఎన్నడూ లోటు ఉండదని భక్తుల విశ్వాసం.
  • శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు (మహా శక్తి పీఠం) అష్టాదశ (18) శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో సతీదేవి కుడి చెవిపోగు పడిందని పురాణాలు చెబుతున్నాయి. వారణాసి నగరమంతటికీ దివ్యమైన శక్తినిచ్చే ఈ మహాతల్లిని కన్నులారా దర్శించుకుని కుంకుమార్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీ సందుల్లో కొలువైన ఈ ఆలయ వాతావరణం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది.
  • శ్రీ కాలభైరవ స్వామి (కాశీ కొత్వాల్) ఈ స్వామిని కాశీ నగరానికి రక్షక భటుడు (కొత్వాల్) అని భక్తితో పిలుస్తారు. శివుని ఉగ్ర రూపమైన కాలభైరవుని అనుమతి, దర్శనం చేసుకోకుండా ఎంతటి వారికైనా కాశీ యాత్ర సంపూర్ణం కాదు. ఈ స్వామి ఆశీస్సులు పొంది, ఇక్కడ రక్షా కంకణం (నల్ల దారం) కట్టుకోవడం వల్ల దుష్ట గ్రహదోషాలు తొలగిపోయి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.
  • పవిత్ర గంగా నదీ స్నానం మరియు మహా హారతి కాశీ యాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించడం. గంగా భవానిలో భక్తితో ఒకసారి మునక వేస్తే గత జన్మల పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. అలాగే, స్నానం అనంతరం దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రతిరోజూ సాయంత్రం వేద మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగే ‘గంగా హారతి’ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసి దైవత్వపు అంచులకు తీసుకెళ్తుంది.

అయోధ్య (శ్రీరామ జన్మభూమి – సప్త మోక్షపురులలో మొదటిది) మన యాత్ర చివరి దశలో మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు జన్మించి, నడయాడిన పుణ్యభూమి అయోధ్య చేరుకుంటాము. హిందూ పురాణాల ప్రకారం మానవులకు జన్మల నుండి మోక్షాన్ని ప్రసాదించే ఏడు పవిత్ర నగరాలు (సప్త మోక్షపురులు – అయోధ్య, మథుర, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారక) ఉన్నాయి. వీటిలో అయోధ్య మొదటిది మరియు అత్యంత పవిత్రమైనది. సాక్షాత్తు ఆ వైకుంఠమే భూమిపై అయోధ్యగా అవతరించిందని, ఇక్కడ అడుగుపెడితేనే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని క్షేత్ర మహత్యం చెబుతోంది. పవిత్ర సరయూ నదీ తీరంలో ఉన్న ఈ నగరం అడుగడుగునా రామనామంతో మార్మోగుతుంటుంది. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మనం అయోధ్యలో ఒక రాత్రి బస చేస్తాము.

హనుమాన్ గర్హి (హనుమాన్ టెంపుల్) అయోధ్య నగరానికి ఆంజనేయ స్వామి రక్షకుడిగా ఉంటాడు. ఇక్కడ శ్రీరాముని దర్శనానికి వెళ్లే ముందు తప్పనిసరిగా హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించి, హనుమంతుడి అనుమతి తీసుకోవడం పురాతన సంప్రదాయం. ఎత్తైన ప్రదేశంలో కొలువైన ఈ ఆలయంలోని మారుతి దర్శనం సకల సంకటాలను తొలిగించి, అపారమైన మనోబలాన్ని ఇస్తుంది.

శ్రీరామ జన్మభూమి (బాల రాముని దర్శనం) హనుమంతుని ఆశీస్సులు పొందిన అనంతరం ఉదయాన్నే నూతనంగా, అత్యంత వైభవంగా నిర్మించిన అయోధ్య శ్రీరామ మందిరాన్ని సందర్శిస్తాము. గర్భగుడిలో కొలువైన అందమైన “బాల రాముని” (రామ్ లల్లా) దివ్య మంగళ రూపాన్ని కన్నులారా చూసి తరించడం ఈ యాత్రలో ఒక మధురమైన, జీవితకాల అనుభూతి.

నైమిశారణ్యం విశిష్టత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోమతి నది ఒడ్డున ఉన్న నైమిశారణ్యం అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. బ్రహ్మ దేవుడు సృష్టికి ముందు తపస్సు చేసిన ఈ ‘స్వయం వ్యక్త క్షేత్రం’లోనే వ్యాస మహర్షి వేదాలను విభజించి, మహాభారతాన్ని మరియు పురాణాలను తన శిష్యులకు బోధించారని ప్రతీతి.

వ్యాస గద్దె (వ్యాస పీఠం)

నైమిశారణ్యంలోని అత్యంత ప్రధానమైన మరియు పవిత్రమైన ప్రదేశాలలో ‘వ్యాస గద్దె’ ఒకటి. ఒక పురాతన మర్రిచెట్టు కింద ఉన్న ఈ పవిత్ర స్థలంలోనే వేద వ్యాస మహర్షి ఆసీనులై తపస్సు చేశారని ప్రతీతి. ఇక్కడే వ్యాస మహర్షి వేదాలను మానవాళి సౌలభ్యం కోసం నాలుగు భాగాలుగా (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం) విభజించారు. మహాభారతం, శ్రీమద్భాగవతం, మరియు 18 (అష్టాదశ) పురాణాలను ఆయన ఈ పీఠం మీదే రచించి, తన శిష్యులైన జైమిని, వైశంపాయనుడు, రోమహర్షణుడు తదితరులకు బోధించారని పురాణాలు చెబుతున్నాయి.

లలితా మందిరం నైమిశారణ్యంలో కొలువైన ఈ ఆలయం ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లలితా త్రిపుర సుందరీ దేవిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శ్రీచక్ర తీర్థం బ్రహ్మ దేవుని మనోమయ చక్రం భూమిపై పడటం వల్ల ఈ పవిత్ర తీర్థం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. నిరంతరం నీరు ఊరే ఈ వృత్తాకార కుండంలో స్నానం ఆచరిస్తే పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. యాత్రికులు అందరు ఇక్కడ స్నానం చేస్తారు.

సత్యనారాయణ వ్రతం భక్తుల కోరిక మేరకు నైమిశారణ్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అదనపు ఖర్చులతో ఏర్పాటు చేయబడును.

సీతమడి (సీతా సమాహిత్ స్థల్) క్షేత్ర విశిష్టత

ఉత్తరప్రదేశ్‌లో వారణాసి, ప్రయాగరాజ్ మధ్య ఉన్న ‘సీతమడి’ రామాయణ కాలం నాటి అత్యంత పవిత్రమైన మరియు భావోద్వేగభరితమైన పుణ్యక్షేత్రం. వాల్మీకి మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉండేదని, సీతాదేవి తన వనవాస కాలంలో ఇక్కడే ఆశ్రయం పొంది లవకుశులకు జన్మనిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసిన తరువాత, సీతాదేవి తన అవతారాన్ని చాలించి సజీవంగా భూమాత ఒడిలోకి (భూగర్భంలోకి) ప్రవేశించిన పవిత్ర ప్రదేశం ఇదేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆశ్రమ ప్రాంగణంలో భూమిలోకి వెళ్తున్న దృశ్యాన్ని కళ్ళకు కట్టేలా ఉన్న సీతామాత అద్భుతమైన విగ్రహాన్ని, అలాగే 108 అడుగుల భారీ హనుమంతుని విగ్రహాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. అత్యంత ప్రశాంతంగా ఉండే ఈ క్షేత్రం భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతుంది

యాత్రా ప్యాకేజీ వివరాలు మరియు షరతులు:

  • యాత్ర పూర్తి సూచనలు మరియు నియమ నిబంధనలు ఇక్కడ చదవండి: https://ramthamedia.in/shree-tours-yatra-packages-terms-and-conditions/
  • గుర్తింపు కార్డులు: విమాన ప్రయాణం మరియు హోటల్ చెక్-ఇన్ కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు+3 జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలి.
  • ప్రయాణ మార్గం: ఈ యాత్రలో హైదరాబాద్ నుండి వారణాశికి, అలాగే తిరుగు ప్రయాణంలో అయోధ్య నుండి హైదరాబాద్ కు నేరుగా ఫ్లైట్ (విమానం) ద్వారా ప్రయాణం ఉంటుంది.
  • స్థానిక ప్రయాణం మరియు బస: యాత్రికుల సంఖ్యను బట్టి స్థానికంగా అన్ని క్షేత్రాలు తిరగడానికి బస్సు లేదా టెంపో ట్రావెలర్ (ఏసీ) ఏర్పాటు చేయబడుతుంది. కుటుంబానికి (2-3 పర్సన్స్) ఒక నాన్ ఎ.సి.  హోటల్ రూమ్ కేటాయించబడుతుంది. ఎ.సి.రూంలకు 4 నైట్స్ కు కలిపి ఒక్కరికి   రూ.2000 అదనం.
  •  భోజన సదుపాయం: యాత్రలో ప్రతిరోజూ ఉదయం టీ/టిఫిన్, మధ్యాహ్నం భోజనం, 1 లీటర్ మినరల్ వాటర్ బాటిల్, సాయంత్రం టీ, రాత్రి భోజనం మా తరపున అరేంజ్ చేయబడుతుంది. విమాన ప్రయాణ సమయంలో మాత్రం భోజన సదుపాయం ఉండదు (యాత్రికులు స్వయంగా చూసుకోవాలి). కాశి చేరుకున్నప్పటి నుండి తిరిగి అయోధ్యలో ఫ్లైట్ ఎక్కే వరకు మొత్తం భోజన బాధ్యత మాదే.
  • హోటల్ బస వివరాలు: మొత్తం 4 రాత్రులు నాన్ ఎ.సి. హోటల్ రూం స్టే ఉంటుంది (, 2 నైట్స్ కాశీ, 1 నైట్ నైమిశారణ్యం,  1 నైట్ అయోధ్య). యాత్రకు ఒంటరిగా (సింగిల్ గా) వచ్చేవారికి ప్రత్యేకంగా సింగిల్ రూమ్ కేటాయింపు కావాలంటే రూ. 4000 అదనంగా చెల్లించాలి. ఎ.సిరూంలకు ఒక్కిరిక రూ.2000 అదనం 4 రాత్రులకు కలపి…
  • బస్సులో సీట్ల కేటాయింపు: బస్సు/ట్రావెలర్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ కావాలనుకునేవారు ఒక్కరికి రూ. 1000 అదనంగా చెల్లించాలి. మిగతా యాత్రికులు ప్రతిరోజూ ఒక వరుస వెనక్కి జరగాల్సి ఉంటుంది (రొటేషన్ పద్ధతి).
  • దర్శన సమయాలు: సమయాభావం, ట్రాఫిక్ సమస్యలు లేదా ఆలయాల్లో అధిక రద్దీ కారణంగా మధ్యలో ఏదేని టెంపుల్ దర్శనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. తదుపరి విమాన సమయానికి చేరుకోవాలి కాబట్టి, టూర్ ఆపరేటర్ ఇచ్చిన సమయానికి యాత్రికులు కచ్చితంగా వాహనం వద్దకు రావాలి.
  • అదనపు ఖర్చులు: మన వాహనం వెళ్ళని చోట్లకు షేరింగ్ ఆటో,రిక్షాల  ఛార్జీలు, గంగా నదిలో బోటు ప్రయాణం, స్పెషల్ దర్శనాలు (కాశీ విశ్వనాథ్, అయోధ్య రామమందిరం తదితర), పూజలు, ప్రయాగ లో పిండప్రదాన కర్మల ఖర్చులు మరియు అభిషేక ఛార్జీలు యాత్రికులదే బాధ్యత.
  • డ్రైవర్ టిప్: డ్రైవర్ టిప్ కింద ఒక్కొక్కరు రూ. 100 అదనంగా చెల్లించవలెను.
  • బుకింగ్ మరియు చెల్లింపు వివరాలు: బుకింగ్స్ కోసం సంప్రదించండి – శ్రీ టూర్స్: 8985246542. సీటు నిర్ధారణ కోసం నాన్-రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 20,000 ను Gpay/Phonepe (8985246542 -A.Ravinder,) ద్వారా చెల్లించాలి. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ రూ. 11,000 + డ్రైవర్ టిప్ రూ. 100 ప్రయాగ్‌రాజ్ చేరుకోగానే క్యాష్ గా పే చేయాలి. (గమనిక: మొత్తం ప్యాకేజీ రూ. 31,000. అప్ డౌన్ విమాన ఛార్జీలు రూ. 15,000 దాటితే ఆ అదనపు ఖర్చు యాత్రికులే చెల్లించాలి).
  • ఈయాత్రతోపాటు కంబైన్డ్ గా నేపాల్ యాత్రను కూడా దర్శించుకోవచ్చును. (నేపాల్ యాత్ర 11-10-2026 న)
https://ramthamedia.in/nepal-muktinath-pashupatinath-ayodhya-flight-yatra/
Share your love
A. Ravinder, RamthaMedia
A. Ravinder, RamthaMedia

A. Ravinder is the founder, chief editor and publisher of RamthaMedia.in, based in Hyderabad, India. He holds an M.A. in Economics and has spent decades studying thousands of ancient scriptures, religious texts and philosophical works, and is a lifelong meditation practitioner. Through years of work as a tour operator he has travelled across India visiting temples and pilgrimage sites. He has written thousands of articles and several books on spirituality and Hindu tradition.

Articles: 275