ప్రయాణ వివరాలు: ఈ పవిత్ర యాత్ర 10-10-2026 న హైదరాబాద్ నుండి ఫ్లైట్ ద్వారా అయోధ్య చేరుకోవడంతో ప్రారంభమవుతుంది. అయోధ్య దర్శనం అనంతరం, నేపాల్ సరిహద్దుల (సోనౌలీ బార్డర్) గుండా ప్రయాణించి నేపాల్లోని మహా క్షేత్రాలను దర్శించుకుంటాము. యాత్ర ముగిసిన అనంతరం 17-10-2026 న గోరఖ్పూర్ విమానాశ్రయం నుండి ఫ్లైట్ ద్వారా తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో ఈ యాత్ర పూర్తవుతుంది. సంప్రదించండి . శ్రీటూర్స్ -8985246542 . ఈ 8 రోజుల యాత్రలో మనం సందర్శించే ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు మరియు వాటి విశేషాలు:
అయోధ్య (శ్రీరామ జన్మభూమి)
మన యాత్ర శ్రీకారం చుట్టుకునేది శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలో. సప్త మోక్షపురులలో మొదటిదైన అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని సందర్శిస్తాము. గర్భగుడిలో కొలువైన అందమైన “బాల రాముని” (రామ్ లల్లా) దర్శనం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈ క్షేత్ర సందర్శనతో మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది.
పోఖరా (ప్రకృతి రమణీయత మరియు అపారమైన ఆధ్యాత్మికత కలబోత)
సోనౌలీ సరిహద్దు గుండా నేపాల్లో అడుగుపెట్టిన తర్వాత ప్రతి యాత్రికుడు ఎంతగానో ఎదురుచూసే అద్భుతమైన నగరం పోఖరా. ఒకవైపు మంచుతో కప్పబడిన అన్నపూర్ణ హిమాలయ శ్రేణులు, మరోవైపు ప్రశాంతమైన సరస్సులు.. ఈ ప్రకృతి సౌందర్యం యాత్రా బడలికను, మనస్సులోని అలజడులను ఇట్టే మాయం చేస్తుంది. కేవలం ప్రకృతికే కాకుండా, అత్యంత శక్తివంతమైన ఆలయాలకు కూడా పోఖరా నిలయం. ఈ యాత్రలో మనం ఇక్కడ ప్రధానంగా మూడు అద్భుతమైన క్షేత్రాలను దర్శించుకుంటాము:
శ్రీ బింద్యబాసిని ఆలయం (Bindabasini Temple): పోఖరా నగరంలో ఒక చిన్న కొండపై కొలువైన పురాతన మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. ఇక్కడ దుర్గామాత స్వరూపమైన భగవతీ దేవిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. స్థానిక నేపాలీల ఇలవేల్పుగా భావించే ఈ శక్తిమయమైన తల్లి దర్శనం సకల శుభాలను, మానసిక ధైర్యాన్ని చేకూరుస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఆలయ ప్రాంగణం నుండి మంచుతో మెరిసిపోయే హిమాలయ పర్వతాల అందాలను చూడటం ఒక మధురానుభూతి.
గుప్తేశ్వర్ మహాదేవ్ గుహాలయం (Gupteshwor Mahadev Cave): భూమి లోపల ఒక సహజ సిద్ధమైన గుహలో కొలువైన అద్భుతమైన శివాలయం ఇది. మెట్లు దిగి వంకర తిరిగిన గుహ మార్గం గుండా లోపలికి వెళ్తున్నప్పుడు కలిగే ఆధ్యాత్మిక ప్రకంపనలు మాటల్లో చెప్పలేనివి. లోపల సహజంగా రాతితో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకోవడం యాత్రికులకు ఒక విశేషమైన అనుభవం. గుహ లోపలి ప్రశాంత వాతావరణంలో శివనామస్మరణ చేసుకుంటే ఆ బోళా శంకరుడి పాదాల చెంత ఉన్న భావన కలుగుతుంది.
ఫేవా సరస్సు (Fewa Lake) – పోఖరా ప్రకృతి సౌందర్యానికి ప్రాణం పోఖరా నగరం అనగానే ప్రపంచవ్యాప్త పర్యాటకులకు ముందుగా గుర్తొచ్చేది అత్యంత సుందరమైన ‘ఫేవా సరస్సు’. ఇది నేపాల్లోని అందమైన సరస్సులలో ఒకటి.
తాల్ బరాహి అమ్మవారు – ఫేవా సరస్సు (Tal Barahi Temple): పోఖరా అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అత్యంత విశాలమైన మరియు అందమైన ‘ఫేవా సరస్సు’ (Fewa Lake). ఆ సరస్సు మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో కొలువైన శక్తివంతమైన ఆలయమే శ్రీ తాల్ బరాహి (వరాహి) అమ్మవారి ఆలయం. దుర్గాదేవి ప్రతిరూపమైన ఈ బరాహి మాతను దర్శించుకోవడానికి రంగురంగుల పడవల ద్వారా (Boat Ride) నీటిపై సాగే ప్రయాణం యాత్రికులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని కొండలు, నీలి రంగు నీళ్ల మధ్యలో కొలువైన ఆ జగన్మాత దర్శనం యాత్రలో మనకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.బోటింగ్ అనుభూతి: రంగురంగుల పడవల్లో (స్థానికంగా వీటిని Doonga అంటారు) ఈ సరస్సుపై విహరించడం ప్రతి యాత్రికుడు అనుభవించాల్సిన ఒక మధురమైన జ్ఞాపకం. చుట్టూ పచ్చని అడవులు, కొండలు, చల్లని గాలి మధ్య పడవ ప్రయాణం యాత్రా బడలికను ఇట్టే మాయం చేస్తుంది. (ఈ సరస్సు మధ్యలో ఉన్న చిన్న ద్వీపంలోనే మనం పైన చెప్పుకున్న శక్తివంతమైన ‘తాల్ బరాహి’ అమ్మవారి ఆలయం ఉంటుంది.అక్కడికి బోట్ ద్వారనే వెళ్ళాలి. ).
ముక్తినాథ్ (సాలగ్రామ దివ్య క్షేత్రం )
ఈ పవిత్ర ఆధ్యాత్మిక యాత్రలో, పోఖరా నుండి హిమాలయాల ఒడిలో కొలువైన పరమ పవిత్ర ముక్తినాథ్ క్షేత్రానికి పయనం అవుతాము. సముద్ర మట్టానికి సుమారు 3700 మీటర్ల ఎత్తులో, తోరంగ్ లా పర్వత శ్రేణులలో ఉన్న ఈ క్షేత్రం, హిందువులకు మరియు బౌద్ధులకు అత్యంత పవిత్రమైనది. దీనిని ‘ముక్తి క్షేత్రం’ మరియు ‘సాలగ్రామ క్షేత్రం’ అని కూడా పిలుస్తారు.
సాలగ్రామ క్షేత్రం యొక్క విశిష్టత: ముక్తినాథ్ చుట్టూ ప్రవహించే కాళీ గండకి నదిలో పవిత్రమైన శాలగ్రామాలు లభిస్తాయి. ఈ శాలగ్రామాలు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రత్యక్ష స్వరూపంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో, శాలగ్రామాన్ని పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి, అపారమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ఈ శాలగ్రామాలు ముక్తినాథ్ ఆలయంలో కూడా ప్రతిష్ఠించబడ్డాయి, అందుకే దీనికి ‘సాలగ్రామ క్షేత్రం’ అని పేరు వచ్చింది.
108 పవిత్ర ముక్తి ధారలు: ముక్తినాథ్ ఆలయ ప్రాంగణంలో, గర్భగుడి వెనుక భాగంలో, అర్ధ వృత్తాకార గోడపై ఏర్పాటు చేసిన 108 పవిత్ర జలధారలు ఉన్నాయి. ఈ జలధారలు ఆవు ముఖం ఆకారంలో ఉంటాయి మరియు 108 వేర్వేరు పవిత్ర క్షేత్రాలకు ప్రతీక అని నమ్ముతారు. బౌద్ధుల నమ్మకం ప్రకారం, ఇవి 108 వేర్వేరు రకాల పాపాలను తొలగిస్తాయి. ఈ 108 ముక్తి ధారల కింద వరసగా స్నానం ఆచరిస్తే, జన్మజన్మల పాపాలు తొలగిపోయి, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వీటిలో స్నానం చేసిన తర్వాత, సమీపంలోని ‘ముక్తి కుండ్’ (పవిత్రమైన చెరువు) లో కూడా మునక వేయడం సంప్రదాయం.
బౌద్ధుల పవిత్రత: బౌద్ధులకు, ముఖ్యంగా టిబెటన్ బౌద్ధులకు, ముక్తినాథ్ అత్యంత పవిత్రమైన క్షేత్రం. టిబెటన్ భాషలో, దీనిని ‘చుమింగ్ గ్యాత్సా’ అంటే ‘నూరు నీటిధారల స్థలం’ అని పిలుస్తారు. బౌద్ధ సిద్ధాంతాల ప్రకారం, బౌద్ధ గురువు పద్మసంభవుడు (గురు రింపోచే) ఈ క్షేత్రాన్ని దర్శించాడని మరియు ఇక్కడ ధ్యానం చేశాడని నమ్ముతారు. అందుకే, హిందువులతో పాటు బౌద్ధులు కూడా ఈ క్షేత్రాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో బౌద్ధ ప్రార్థనా చక్రాలు మరియు ధ్వజాలను (Prayer Flags) కూడా మనం చూడవచ్చు.
ఖాట్మండు (పశుపతినాథ్ మరియు గుహ్యేశ్వరి మహా శక్తి పీఠం)
నేపాల్ రాజధాని ఖాట్మండులో అత్యంత శక్తివంతమైన దేవాలయాల దర్శనం ఉంటుంది:
శ్రీ పశుపతినాథ్ ఆలయం (కేదార్నాథ్ కు అనుసంధానమైన మహా పుణ్యక్షేత్రం) ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన మహా పుణ్యక్షేత్రం. పరమశివుడు పశుపతినాథుడిగా (సకల జీవరాశులకు అధిపతిగా) కొలువైన ఈ అద్భుత ఆలయం పవిత్ర భాగమతి నదీ తీరాన విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి నాలుగు వైపులా నాలుగు ముఖాలు (చతుర్ముఖ శివలింగం) మరియు పైభాగంలో మరొక ముఖం ఉంటాయి. ఇవి శివుని యొక్క వేర్వేరు తత్వాలను సూచిస్తాయి. భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఉన్న ప్రసిద్ధ ‘కేదార్నాథ్’ జ్యోతిర్లింగం యొక్క తల భాగమే ఈ పశుపతినాథ్ శివలింగం అని పురాణాలు బలంగా చెబుతున్నాయి (కేదార్నాథ్లో శివుని వృషభ రూపం వెనుక భాగం ఉంటుంది). అద్భుతమైన నేపాలీ పగోడా శైలి శిల్పకళతో, బంగారు పైకప్పు మరియు వెండి తలుపులతో మెరిసిపోయే ఈ ఆలయ దర్శనం, సాయంత్రం భాగమతి నది ఒడ్డున వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగే మహా హారతి మన జన్మను ధన్యం చేస్తాయి.
గుహ్యేశ్వరి మాత (సకల కోరికలు తీర్చే అష్టాదశ మహా శక్తి పీఠం) పశుపతినాథ్ ఆలయానికి అతి సమీపంలో, భాగమతి నది ఒడ్డున కొలువైన ఈ ఆలయం హిందువుల అష్టాదశ (18) మహా శక్తి పీఠాలలో ఒకటిగా ఎంతో విశిష్టతను సంతరించుకుంది. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి భౌతిక కాయాన్ని పరమశివుడు ఆకాశ మార్గంలో తీసుకెళ్తున్నప్పుడు, ఇక్కడ మాత సతీదేవి యొక్క ‘రెండు మోకాళ్లు’ పడ్డాయని పురాణ గాథలు చెబుతున్నాయి. గుహ్యేశ్వరి అంటే ఆంతరంగిక లేదా రహస్యమైన శక్తి అని అర్థం. ఈ అమ్మవారిని దర్శించుకోకుండా పశుపతినాథుని యాత్ర సంపూర్ణం కాదని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ మూర్తికి బదులుగా ఒక వెండి కలశాన్ని సాక్షాత్తు అమ్మవారిగా భావించి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ శక్తిపీఠ దర్శనం వల్ల భక్తులకు అపారమైన మానసిక బలం, సకల శుభాలు కలుగుతాయి.
జల నారాయణ ఆలయం – బుధానిల్కంఠ (నీటిలో తేలియాడే శ్రీ మహావిష్ణువు) ఖాట్మండులోని శివపురి కొండల దిగువన ఉన్న ఈ అద్భుతమైన ఆలయం శ్రీ మహావిష్ణువు భక్తులకు కనుల పండువ లాంటిది. ఇదొక ఓపెన్-ఎయిర్ (ఆరుబయట ఉన్న) ఆలయం. ఒకే భారీ నల్లరాతితో (Black Basalt Stone) అత్యంత సూక్ష్మమైన పనితనంతో చెక్కబడిన ఈ స్వామివారి విగ్రహం సుమారు 5 మీటర్ల పొడవు ఉంటుంది. విశాలమైన నీటి కొలను మధ్యలో, 11 పడగలున్న శేషనాగుపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు (Sleeping Vishnu) దివ్య మంగళ రూపం ఇది. ఈ విగ్రహం యొక్క అతిపెద్ద అద్భుతం ఏమిటంటే.. ఇంతటి భారీ రాతి విగ్రహం మునిగిపోకుండా, ఆ కొలను నీటిలో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తుంది. విశ్వజలాల్లో శయనిస్తున్న నారాయణుని తత్వాన్ని ఈ అద్భుత రూపం మనకు కళ్ళకు కట్టినట్లు చూపుతూ, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది.
బౌద్ధ స్తూపం (ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాంతి నిలయం) ఖాట్మండు నగరం హిందూ దేవాలయాలకే కాకుండా అద్భుతమైన బౌద్ధ సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ యాత్రలో భాగంగా యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన, బౌద్ధులకు అత్యంత పవిత్రమైన భారీ బౌద్ధ స్తూపాన్ని కూడా మనం సందర్శిస్తాము. విశాలమైన అర్ధ గోళాకారంలో ఉండే ఈ భారీ స్తూపం పైభాగంలో బుద్ధుని ‘జ్ఞాన నేత్రాలు’ (నాలుగు దిక్కులా చూస్తున్న కళ్లు) మనకు కనిపిస్తాయి. ఇవి విశ్వమంతటా వ్యాపించి ఉన్న బుద్ధుని కరుణకు మరియు సర్వజ్ఞత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. గాలికి రెపరెపలాడే రంగురంగుల ప్రార్థనా జెండాలు (Prayer Flags), ఆవరణలో ప్రశాంతంగా వినిపించే బౌద్ధ మంత్రోచ్ఛారణలు యాత్రికుల మనస్సులోని అలజడులను తొలగించి, అంతులేని ప్రశాంతతను పంచుతాయి.
శ్రీ మనోకామన మాత (కోరికలు తీర్చే కల్పవల్లి మరియు అద్భుతమైన కేబుల్ కార్ ప్రయాణం)
మన యాత్రలో అత్యంత ఉత్సాహభరితమైన మరియు ఆధ్యాత్మికమైన ఘట్టం ‘మనోకామన’ క్షేత్రానికి చేరుకోవడం. నేపాల్లోని గూర్ఖా జిల్లాలో, సముద్ర మట్టానికి సుమారు 1300 మీటర్ల ఎత్తైన పర్వతంపై కొలువైన ఈ అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లి.
ప్రకృతి రమణీయత: ఆలయ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత అక్కడి నుండి కనిపించే మానస్లు (Manaslu) మరియు అన్నపూర్ణ మంచు పర్వత శ్రేణుల దృశ్యాలు యాత్రా బడలికను ఇట్టే మాయం చేస్తాయి. భక్తితో పాటు అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఈ మనోకామన సందర్శన మన యాత్రకు ఒక పరిపూర్ణతను తీసుకువస్తుంది.
పేరులోని ఆంతర్యం మరియు విశిష్టత: స్థానిక భాషలో ‘మనో’ అంటే మనస్సు, ‘కామన’ అంటే కోరిక. తమ మనస్సులోని కోరికలను నెరవేర్చే మహా తల్లిగా భగవతీ దేవి (పార్వతీ మాత అవతారం) ఇక్కడ పూజలందుకుంటుంది. స్వచ్ఛమైన మనస్సుతో అమ్మవారిని దర్శించుకుని ఏది కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే కోరికలు తీరిన భక్తులు మళ్లీ మళ్లీ వచ్చి ఇక్కడ తమ మొక్కులు చెల్లించుకోవడం ఒక పురాతన సంప్రదాయంగా వస్తోంది.
అద్భుతమైన ‘కేబుల్ కార్’ (రోప్ వే) ప్రయాణం: పర్వత శిఖరంపై ఉన్న ఈ అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి మనం నేపాల్లోనే మొట్టమొదటి మరియు అత్యంత ప్రసిద్ధ ‘కేబుల్ కార్’ (రోప్ వే) ద్వారా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాము. సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు గాల్లో సాగే ఈ ప్రయాణం ప్రతి యాత్రికుడికి ఒక మధురానుభూతిని ఇస్తుంది. కేబుల్ కార్ లోపలి నుండి కింద పచ్చని లోయలు, మెట్లు మెట్లుగా ఉండే వ్యవసాయ భూములు, వంపులు తిరుగుతూ ప్రవహించే పవిత్ర త్రిశూలి నది అందాలను వీక్షించడం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
యాత్రా ప్యాకేజీ వివరాలు మరియు సూచనలు
మొత్తం యాత్రా ఖర్చు:రూ. 43,000/- (ఒకరికి) చెల్లింపు వివరాలు: బుకింగ్ కోసం నాన్-రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 30,000 ను నాన్ రిఫండబుల్ అమౌంట్ గా చెల్లించాలి. Gpay/Phonepe ద్వారా 8985246542 .A.Ravinder, బ్యాలెన్స్ అమౌంట్ యాత్ర ప్రారంభంలో క్యాష్ గా పే చేయాలి.
ప్యాకేజీలో చేర్చబడినవి: అప్ అండ్ డౌన్ విమాన ప్రయాణం (హైదరాబాద్ నుండి అయోధ్య మరియు గోరఖ్పూర్ నుండి హైదరాబాద్కు).
ముఖ్య గమనిక: విమాన టికెట్ (రానుపోను) ధర రూ. 15,000 వరకు మాత్రమే ఈ ప్యాకేజీలో కవర్ చేయబడుతుంది. విమాన ఛార్జీలు రూ. 15,000 దాటితే, ఆ అదనపు ఖర్చును యాత్రికులే స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది.
నేపాల్ ప్రవేశ నిబంధనలు (గుర్తింపు కార్డులు): నేపాల్ వేరే దేశం అయినందున, ప్రవేశానికి ఒరిజినల్ ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడి కార్డు లేదా ఒరిజినల్ పాస్పోర్ట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. కలర్ జిరాక్స్లు అనుమతించబడవు.
ప్రయాణ మార్గం: హైదరాబాద్ నుండి అయోధ్య కు, మరియు తిరిగి గోరఖ్పూర్ నుండి హైదరాబాద్ కు ఫ్లైట్ ప్రయాణం ఉంటుంది.
స్థానిక ప్రయాణం మరియు బస: యాత్రికుల సంఖ్యను బట్టి అయోద్యనుండి మొదలై నేపాల్లో స్థానికంగా తిరగడానికి మిని బస్సు లేదా టెంపో ట్రావెలర్ ఏర్పాటు చేయబడుతుంది. కుటుంబానికి (2-3 పర్సన్స్) ఒక నాన్ ఎ.సి. హోటల్ రూమ్ కేటాయించబడుతుంది.
భోజన సదుపాయం: ఉదయం టీ/టిఫిన్, మధ్యాహ్నం భోజనం, 1 లీటర్ మినరల్ వాటర్ బాటిల్, సాయంత్రం టీ, రాత్రి భోజనం మా తరపున అరేంజ్ చేయబడుతుంది. (విమాన ప్రయాణ సమయంలో భోజన సదుపాయం ఉండదు). అయోధ్య చేరుకున్నప్పటి నుండి తిరిగి ఫ్లైట్ ఎక్కే వరకు భోజన బాధ్యత మాదే.
హోటల్ బస వివరాలు: మొత్తం 7 రాత్రులు హోటల్ స్టే ఉంటుంది (అయోధ్య, పోఖరా, జొమ్సోమ్, ఖాట్మండు, భైరహవా). సింగిల్ గా వచ్చేవారికి ప్రత్యేకంగా సింగిల్ రూమ్ కావాలంటే ప్యాకేజీకి అదనంగా రూ.5000 ఛార్జీలు చెల్లించాలి. ఏ.సిరూంలు కావాలంటే అదనంగా ఒక్కరికి రూ.4000 చెల్లించాలి.నేపాల్ లో ఎ.సి.రూమ్ ల అవసరం అవసరం పడదు పైగా అక్టోబర్ లో అసలు అవసరం ఉండదు చలి కాబట్టి.
బస్సులో సీట్లు: బస్సు/ట్రావెలర్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ కు రూ.1000 అదనపు ఛార్జీ ఉంటుంది. మిగతావారు ప్రతిరోజూ ఒక వరుస వెనక్కి జరగాలి.
దర్శన సమయాలు: సమయాభావం లేదా ట్రాఫిక్/అధిక రద్దీ కారణంగా దర్శనం మిస్ కావచ్చు. టూర్ ఆపరేటర్ ఇచ్చిన సమయానికి యాత్రికులు కచ్చితంగా వాహనం వద్దకు రావాలి.
ప్రత్యామ్నాయ ఖర్చులు: ఫ్లైట్ క్యాన్సిల్ అయితే లేదా వాతావరణ పరిస్థితుల వల్ల (ముఖ్యంగా ముక్తినాథ్ ప్రయాణంలో) మార్పులు జరిగితే తదుపరి గమ్యస్థానానికి వెళ్లే అదనపు రవాణా ఖర్చులు యాత్రికులే భరించాలి.
అదనపు ఖర్చులు:ముక్తినాధ్ పర్మిట్ కు రూ.1000 అదనం . ముక్తినాధ్ లో గుర్రం సుమారు రూ1500 డొలి రూ.4000 (ఇండియన్ రూపాయల్ల అదనం). . మన వాహనం వెళ్ళని చోట్లకు , ఆటో ఛార్జీలు, రోప్ వే / కేబుల్ కార్ ఛార్జీలు (మనోకామన రోప్ వే రూ.700 అదనం,), స్పెషల్ దర్శనాలు మరియు పూజల ఖర్చులు యాత్రికులదే బాధ్యత.
డ్రైవర్ టిప్: నేపాల్ డ్రైవర్లకు మరియు హెల్పర్లకు టిప్ అదనంగా చెల్లించవలసి ఉంటుంది.
పై నేపాల్ యాత్రతో పాటు ఈ కాశి యాత్ర కూడా కంబైన్డ్ గా ప్లాన్ చేసుకోవచ్చును.